వరలక్ష్మి 2012లో “పోడా పోడి” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మొదట హీరోయిన్ గా వరలక్ష్మి అంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం దుమ్ము దులుపుతోంది. వీర సింహా రెడ్డి, హనుమాన్ సినిమాల్లో వరలక్ష్మి మంచి క్యారెక్టర్లు చేసింది. ధనుష్ కొత్త సినిమా “రాయాన్”లో కూడా ఆమె కనిపిస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి వరలక్ష్మి వివాహం జరగబోతోంది.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయాన్ని వెల్లడించింది. పెళ్లికొడుకు మరెవరో కాదు.. ఆమె ఎంతగానో ప్రేమించిన ప్రియుడినే వివాహం చేసుకోబోతోంది. అతను మరెవరో కాదు.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్ దేవ్. వీళ్లిద్దరు గత 14 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారంట. ఇప్పుడు పెద్దలకు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పి..
వారిని ఒప్పించి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ వేడుక కేవలం కుటుంబసభ్యులు, అతి సన్నిహితుల మధ్యే జరిగింది. మార్చి 1నే వీళ్లి నిశ్చితార్థం జరగ్గా ఈరోజు వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరలక్ష్మి శరత్ కుమార్- నిక్లాయ్ సచ్ దేవ్ నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.