అందరి ముందు భార్యపై దిల్ రాజు ఎలా సీరియస్ అయ్యాడో చుడండి.

గత సంవత్సరం తేజస్విని ఓ బాబుకి జన్మనిచ్చింది. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. తేజస్వినితో పాటు దిల్‌ రాజు తమ వివాహానికి సంబంధించి తొలిసారి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. దిల్‌రాజు తేజస్విని ఎలా కలిశారన్న విషయాలను తెలుపుతూ.. ‘నా మొదటి భార్య అనిత మరణించిన తర్వాత రెండేళ్లు చాలా కష్టాన్ని అనుభవించాను. నేను అప్పటికే 47 ఏళ్లు ఉన్నాయి.

జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలి అనుకుంటున్న సమయంలో రెండు, మూడు ఆప్షన్స్‌ ఉన్నాయి. కానీ నా బిజీ లైఫ్‌ కారణంగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను. అదే సమయంలో నేను విమానంలో ప్రయాణం చేసే సమయంలో తెజస్విని పరిచయం అయ్యింది. ఫోన్‌ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ జర్నీ తర్వాత ప్రపోజ్‌ చేయడం, ఆ తర్వాత ఫ్యామిలీతో చర్చలు. చివరికి వివాహం వరకు వెళ్లింది’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.

ఇక తేజస్వినిలో తనకు నచ్చింది తను.. గ్రౌండ్ టు ఎర్త్‌ కావడమే అని తెలిపారు. ఇక దిల్‌రాజు తనకు ఎలా పరిచయమయ్యారన్న విషయాన్ని తేజస్విని చెబుతూ.. ‘నేను ఎయిర్‌ లైన్స్‌లో పనిచేస్తున్న సమయంలో, ఈయన రెగ్యులర్‌గా ట్రావెల్‌ చేసేవారు. మొదటిసారి నన్ను కలిసినప్పుడు పన్‌ అడిగారు. నేను షిఫ్ట్‌లో ఉన్న ప్రతీసారి విమానంలో కనిపించేవారు’ అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *