విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన మంచు లక్ష్మి అక్కడ నటిగా శిక్షణ తీసుకుని ఇంగ్లీష్ సినిమాలు చేసింది. 2008లో హాలీవుడ్ మూవీ ది ఒడేతో సినిమా రంగంలో ఎంటర్ అయింది మంచు లక్ష్మి. ఇందులో నజ్మా పాత్రలో మెప్పించిన ఈ మంచువారి అమ్మాయి తర్వాత 2009లో డెడ్ ఎయిర్ అనే సినిమా చేసింది. ఇలా హాలీవుడ్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన తొలి తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మంచు లక్ష్మి.
అయితే మంచు లక్ష్మి, తండ్రి నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు. దర్శకేంద్రుని కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నుండి అడపాదడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు.
అయితే లక్ష్మి ఇటూ సినిమాలు చేస్తూనే అటూ బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగువారిని అలరిస్తోంది. తెలుగు తెరకు పరిచయం కాక ముందు లక్ష్మి, ‘లాస్ వెగాస్’, ‘డెసపరేట్ హౌజ్ వైవ్స్’ లాంటీ కొన్ని అమెరికన్ టెలివిజన్ షోస్లలో నటించింది.