సెల్యూట్. అనాధల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సితార.

మహేష్‌బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఎంబీ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ షోకు మహేష్‌ గారాలపట్టీ సితార ఘట్టమనేని హోస్ట్‌ చేశారు. చీర్స్‌ ఫౌండేషన్సకు చెందిని చిన్నారులతో సితార సందడి చేశారు. వారితో కలిసి సినిమా చూసిన అనంతరం సినిమా పట్ల చిన్నారుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. హీరో మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని మరోసారి అందరి మనసులు గెలుచుకుంది.

చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం “గుంటూరు కారం” సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు, ఏఎంబీ సినిమాస్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. పిల్లలతో పాటు, వారి సంరక్షకులు కూడా మహేష్ బాబు నటించిన తాజా చిత్రం “గుంటూరు కారం” ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు.

సితార ఘట్టమనేని, తన సహజసిద్ధమైన ఆకర్షణతో, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. ఇంటర్వెల్ లో తనే స్వయంగా పిల్లలకు స్నాక్స్ అందించింది. కూతురు చేసిన ఈ ఛారిటీ కార్యక్రమాన్ని మహేష్ బాబు ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ వివిధ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక ప్రదర్శన సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ ను పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *