పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులు అవుతారు.?

నార్మల్ డెలివరీ కావడంతో పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, పాదం ఏంటో చూసి అవసరమైన శాంతి, పూజలు , జపాలు, హోమాలు చేయించేవారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. శుభసమయం, శాంతి లేని నక్షత్రం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో మాత్రం శాంతి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు.

అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం నక్షత్ర రాశుల సమూహంలో ధనిష్ఠ రాశికి ప్రత్యేక స్థానముంది. 27 నక్షత్రాల్లోనూ 23వ స్థానంలో ఉన్న ధనిష్ఠ.. నాలుగు నక్షత్రాలతో రూపొందించబడింది. దీని ఆకారం మృదంగం ఆకారాన్ని పోలి ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ధనిష్ఠ నక్షత్రం అధిపతి అంగారకుడు, శని. దేవతం వసు.. అధిష్ఠాన దేవుడు అష్టవసవాలుడు.

ధనిష్ఠ నక్షత్రంలో మొదటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులకు మకరం, చివరి రెండో పాదాల్లో పుట్టినవారికి కుంభం రాశి అవుతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అంగారకుడు, శని ప్రత్యేక ప్రభావాన్ని చూపుతారు. అంతేకాకుండా ఇందులో పుట్టినవారు ధనవంతులవుతారు. సంపద, వైభవాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా పరోపకారం చేయడంలో ముందుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *