సినిమాలు హిట్ అయితే తప్ప మనల్ని ఎవరు పట్టించుకోని ఇండస్ట్రీ కాబట్టి పూరి ప్రస్తుతం కాస్త డౌన్ ఫాల్ చూస్తున్నాడు. కొడుకు ఆకాష్ ను హీరోగా పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు దొరకని పరిస్థితి. ఇక కూతురు అయినా హీరోయిన్ గా మరి అయన కష్టాలు తీరుస్తుందా అంటే ఆ పని జరిగేలా కనిపించడం లేదు. అయితే ఈ చిట్టి ప్రస్తుతం పదహారణాల ఆడపడుచులా మారిపోయింది.

ఈ మధ్య క్యూట్ లుక్స్ తో అదరగొట్టేలా ఫోటో షూట్స్ కూడా చేస్తోంది పవిత్ర. అయితే ఆమెకు నటన పై ఆసక్తి పోయిందట. అందుకే, మళ్లీ ఎప్పుడూ నటన జోలికి రాలేదు. గతంలో తనకు హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కావాలని ఉండేది అని..ఐతే, ప్రస్తుతానికి నటనపై ఆసక్తి లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది పవిత్ర. ప్రస్తుతం ఆమె మాస్టర్ డిగ్రీ చేస్తోంది. భవిష్యత్తులో మళ్లీ నటన జోలికి రాకపోయినా.. కచ్చితంగా ఇండస్ట్రీలోనే ఉంటాను అంటుంది పవిత్ర. తనకు సినిమా నిర్మాణం అంటే చాలా ఇష్టమని.. అందుకే, ప్రొడక్షన్లో కి ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుంది.

బాలయ్య ‘పైసా వసూల్’ సినిమాతో పాటు ఆకాశ్ ‘రొమాంటిక్’ సినిమాకి కూడా పవిత్ర ప్రొడక్షన్ లో పని చేసింది. ఎలాగూ పూరి జగన్నాధ్ కాలక్రమేణా తన వైభవాన్ని కోల్పోతూ వస్తున్నాడు. ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్న పూరికి నిర్మాతలు దొరకని పరిస్థితి ఉంది. అందుకే, లైగర్ ను కూడా ఓన్ గానే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి కూతురే భవిష్యత్తులో నిర్మాతగా మారి పూరితో సినిమా చేస్తోందేమో చూడాలి. అన్నట్టు 2023 లో పవిత్ర నిర్మాతగా మారనుంది.