ఇంట్లో సీసీ కెమెరా ఉందని తెలియక, ఈ పనిమనిషి ఎలాంటి పని చేసిందో చుడండి.

పని మనిషి చేసిన పాడుపనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛీ..ఛీ.. మనిషేనా? అని అంతా తిడుతున్నారు. ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదంటున్నారు. ఈరోజుల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. దానికి ఇదేం మాయరోగం? ఎందుకిలా శాడిస్ట్ లా ప్రవర్తిస్తోంది? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

కొత్త వారిని పని మనిషిగా పెట్టుకునే ముందు ఇంటి యజమాని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం అంటున్నారు. ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకుంటే ఇదిగో ఇలాంటి ఘోరాలే జరుగుతాయంటున్నారు. అందుకే పనిలోకి తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కూడా పని మనిషిపై కచ్చితంగా నిఘా ఉండటం ఇంటి యజమానికి ఎంతో మంచిదంటున్నారు నెటిజన్లు. పని మనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెని విచారించారు.

మూత్రం పోసిన నీటితోనే తాను ఇంటిని శుభ్రం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో ఆ పని మనిషి తన నేరాన్ని ఒప్పుకుంది. ఆ పని మనిషికున్న పాడు ప్రవర్తన గురించి ఆమె కుటుంబసభ్యులు తెలుసుని పోలీసుల విచారణలో తేలింది. గత 6 నెలలుగా అలోక్ సింగ్ ఇంట్లో ఆమె పని చేస్తోంది. తనకు ఏదైనా పని ఇవ్వాలని 6 నెలల క్రితం అలోక్ సింగ్ ను వేడుకోవడంతో.. ఆయన ఆమెను తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. చివరికి.. సీసీటీవీ కెమెరా వల్ల పని మనిషి పాడు పని గురించి ప్రపంచానికి తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *