బిగ్ బాస్ ఇప్పటి వరకూ తెలుగులో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. కానీ, వీటన్నింటిలోనూ చూపించని కొత్త కొత్త కంటెంట్ను ఏడో సీజన్లో ప్రసారం చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే దీనికి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ షో రేటింగ్ను కూడా భారీగా రాబడుతోంది. దీంతో నిర్వహకులు మరింత ఉత్సాహంతో కొత్త కొత్త టాస్కులు తెస్తున్నారు.
అయితే బిగ్ బాస్ 9వ వారంలో అమర్ దీప్, శోభా శెట్టి, రతిక రోజ్, భోలే షావలి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, అర్జున్ అంబటి నామినేట్ అయ్యారు. వీరిలో మొదటి రోజు నుంచి ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరికి అధికంగా ఓట్లు పడుతున్నాయి. దీంతో ప్రిన్స్ యావర్ మొదటి స్థానం, అమర్ రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చారు. సింగర్ భోలేకు ప్రేక్షకులు ఓట్లు వేస్తూ మూడో స్థానం కట్టబెట్టారు.
ఇక అర్జున్ నాలుగు, ప్రియాంక ఐదు, రతిక ఆరు స్థానాల్లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్లో అంటే ఏడో స్థానంలో టేస్టీ తేజ, ఎనిమిదో స్థానంలో శోభా శెట్టి ఉన్నారు. అంటే, శోభా ఎలిమినేషన్లో ఉన్న ప్రతిసారీ లీస్ట్ ఓటింగ్లో ఉంటోంది. కానీ, ప్రతివారం ఆమెను కాకుండా నయని పావని, ఆట సందీప్ వంటి కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈసారి కూడా శోభా లీస్టు ఓటింగ్లో ఉంది. దీంతో ఈ వారం కూడా ఆమెను కాపాడేందుకు శోభా కంటే ముందు స్థానంలో ఉన్న టేస్టీ తేజను ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది.