ఆసుపత్రి పాలైన స్టార్ హీరోయిన్, అసలు విషయం చెప్పిన వైద్యులు.

తాజాగా పాపులర్ హీరోయిన్ ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటో పోస్ట్ అందరిని షాక్ కి గురిచేసింది. తెలుగు, తమిళ హీరోయిన్ సునైన గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ. అయితే సునైనా..2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాల్లో నటించి అలరించింది.

అంతకు ముందు కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ త్వాత నీర్ పార్వై సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొంది. చివరిసారిగా ఆమె లాఠీ చిత్రంలో కనిపించింది. ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అంతగాగుర్తింపు రావడం లేదు.ఇటీవల ఆమె నటించిన రెజీనా సినిమా ప్రమోషన్లలో సునైనా మాట్లాడుతూ..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా చూసి తనకు నటి కావాలనే కోరిక వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం సునైనా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. గతంలో సునైనా కిడ్నాప్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. గత రెండు రోజులుగా సునైనా కిడ్నాప్ గురైందని వార్తలు వినిపించాయి. దీంతో ఆమె గురించి పోలీసులు విచారణ చేపట్టారు. అదే సమయంలో అది కేవలం సినిమా స్టంట్ అని.. తన నెక్ట్స్ మూవీ కోసం అలా కిడ్నాప్ డ్రామా ఆడారని తెలియడంతో సునైనా పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *