నాగార్జున దగ్గరకు వెళ్తా..! ఇంటికొచ్చి కొడతా..! ఏడ్చేసిన అమర్‌ తల్లి.

బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగే సంఘటనలను కొందరు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. కొన్ని పీఆర్‌ టీమ్స్‌ వారి కంటెస్టెంట్‌కు హైప్‌ ఇవ్వడానికి బదులు అవతలవారిని దూషిస్తూ నిందలేస్తూ ఉన్నాయి. అయితే అమర్ దీప్ మొదటినుంచి ఆట మీద ఫోకస్ పెట్టినా ఏదో ఒక గందరగోళం చేసి చివరి నిమిషంలో ప్లాప్ అవుతున్నాడు. ఇక గతవారం అమర్ తన గేమ్ ను ఇంప్రూవ్ చేసుకున్నాడు.

ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ .. అమర్ దీప్ కుటుంబాన్ని వేధించడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పల్లవి ప్రశాంత్ ఎంత రైతు బిడ్డ అయినా.. యూట్యూబర్ అయినా కూడా బయట మంచి పీఆర్ ను పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్లు.. కొంతమంది కుర్రాళ్లను పోగుచేసి.. ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని.. అమర్ దీప్ ఫ్యామిలీని నీచంగా తిడుతున్నారు. ఇక ఈ విషయమై అమర్ తల్లి స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది.

‘నేను అమర్‌దీప్‌ తల్లిని.. మీకు ఏమైనా మతుండే అలాంటి కామెంట్స్‌ పెడుతున్నారా? కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్‌ ఏమైనా పై నుంచి దిగివచ్చాడా?.. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు.. ప్రశాంత్‌ దగ్గరకు అమర్‌దీప్‌ భార్యని, తల్లిని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావ్‌రా.. మీకు పల్లవి ప్రశాంత్‌ మీద ప్రేముంటే ఓట్లేసి గెలిపించుకోరా.. అంతేకానీ తల్లి, భార్యల జోలికి వస్తే ఇంటికి వచ్చి కొడతా.

నేను అమ్మను రా.. నన్ను ప్రశాంత్‌ దగ్గరకు పంపిస్తావా? ఎవడ్రా నీకు చదువు నేర్పింది? కొంచెమైనా సంస్కారం ఉందా?.. నీచమైన బతుకులు మీవి.. ఆడవారిపై ఇలాంటి మాటలు అనడం మీకు సిగ్గుగా లేదు. ఇంట్లోవాళ్లు ఎంతగా బాధపడతారో మీకు తెలియదా.. ? మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు. నాగార్జున దగ్గరకు వెళ్లి ఇదే విషయం మాట్లాడతా.. ఏమనుకుంటున్నారో, జాగ్రత్త’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *