ప్రముఖ నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎన్నో సినిమాలను తన భుజాలపై మోసి సక్సెస్ అయ్యేలా చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇంత వయసు అవుతున్నా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాజర్. అయితే గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న మహబూబ్ భాషా (94) మంగళవారం (అక్టోబర్ 10) తీవ్ర ఆశ్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్మలైలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.
మెహబూబ్ భాషా మృతి విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నాజర్ తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెహబూబ్ భాషా అంత్యక్రియలు చెంగల్పట్టులో రేపు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా నటుడు నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరియం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, కమెడియన్గా, విలన్గా.. నటించి మెప్పించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళం భాషల్లోని దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించారు.

ముఖ్యంగా బాహబలి చిత్రంలో రానా తండ్రి బిజ్జాల దేవాగా కీలక పాత్ర పోషించిన ఆయన ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. ఇలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో నాజర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ధనుశ్ నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక నటుడు నాజర్కు కెరీర్ తొలినాళ్ల నుంచి మాబూబ్ బాషానే అండగా నిలిచారు. సినిమాల్లోకి వెళ్తానని ఆయన అభిరుచిని తండ్రికి తెలిపినప్పుడు ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా..
ఎంత కష్టమైన నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని వెన్ను తట్టి ప్రోత్సహించినట్లు నాజర్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. సినిమాల్లో అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నప్పుడు కూడా తండ్రి మాబూబ్ భాషానే సర్దిచెప్పి మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా ప్రోత్సహించారట. తండ్రి ప్రోత్సాహం తోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు ఎన్నోసార్లు నాజర్ చెప్పారు. ఇక తండ్రి మరణంతో కృంగిపోయిన నాజర్ త్వరలోనే మామూలు వ్యక్తిగా మారాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.