భవ్య శ్రీ కేసులో ఏం జరిగిందో SP చెప్తుంటే రక్తం మరిగిపోతుంది.

భవ్యశ్రీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ”21వ తేదీన పోస్టుమార్టం పూర్తయింది. అయితే అది చిత్తూరు జిల్లా పెనమూరు పరిధిలోని వేణుగోపాలపురం గ్రామం. ఇదే ఊరికి చెందిన భవ్యశ్రీ (16) అనే బాలిక స్థానిక పట్టణంలో ఇంటర్ చదువుతోంది. ఈ బాలిక అందరితో ఎంతో చలాకీగా హుషారుగా ఉండేది.

మరో విషయం ఏంటంటే? స్థానికంగా ఉండే ఓ ముగ్గురు యువకులు ఈ అమ్మాయిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ అమ్మాయి మాత్రం వారిని పట్టించుకునేది కాదని సమచారం. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 17న ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ.. ఆ రోజు రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు చుట్టు పక్కల గ్రామాల్లో వెతికి బంధువులకు సమాచారం అందించారు. అయినా కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక వారికి ఏం చేయాలో తెలియక సెప్టెంబర్ 18న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అదే నెల 20న స్థానికంగా ఉన్న ఓ బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆ అమ్మాయి జుట్టు అంతా ఊడిపోయి, కళ్లు బయటకు వచ్చాయి. కూతురిని అలా చూసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *