సిల్క్ స్మిత అప్పట్లో చాలామందికి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. దీంతో అప్పట్లో ఈ హీరోయిన్ లేని తమిళ , తెలుగు సినిమాలు ఒక్కటి కూడా ఉండకపోయేవి. దీంతో ఇండస్ట్రీలోనే సిల్క్ స్మిత బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. బిజీ ఆర్టిస్ట్ అవడం వల్ల చాలా డబ్బులు ఈమెకు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో.. సిల్క్ స్మిత చివరిసారిగా రాసిన లెటర్ బాగా చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ లెటర్ లో సిల్క్ స్మిత ఏం రాసిందంటే.. ఆమె ఏడు సంవత్సరాల వయసు నుంచి ప్రతి రోజు కష్టాన్ని చూసి పెరిగిందంట.
ఆమెను ప్రేమించే వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండేవారు కాదంట. అందరూ తన కష్టాన్ని దోచుకునే వారి తప్ప తనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదంట. ప్రతి ఒక్కరు తనని మోసం చేసేవారని.. రాధాకృష్ణ, రాము వీళ్ళిద్దరూ సిల్క్ ని చాలా దారుణంగా మోసం చేశారు అంట. దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళిద్దర్నీ ఖచ్చితంగా శిక్షిస్తాడని ఆమె తెలిపింది. ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా జీవితంలో అడుగుపెట్టి మంచి లైఫ్ ఇస్తానని చెప్పి.. తిరిగి నేను సంపాదించిన ఆస్తులు అన్ని మొత్తం లాక్కొని చివరికి మోసం చేశాడు అని చెప్పింది.

ఆ వ్యక్తి ప్రతీరోజు పెట్టె టార్చర్ భరించలేకపోతున్నాని చెప్పింది. అయితే సిల్క్ స్మిత రాసిన లెటర్లో.. తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్న విషయం టైం రాయలేదు. రాధాకృష్ణ పేరు రావడంతో ఆమె చనిపోయాక అతని పోలీసులు అరెస్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. జీవితంలో ఏడు సంవత్సరాల వయసు నుంచి ఒకటి కష్టాన్ని చూడడం అయితే వయసు పెరిగే కొద్దీ కనీసం ప్రేమించే మనుషులు కూడా ఆమెకి లేరని.. ఈ రెండు విషయాలు చదివి అందరూ కన్నీరు పెడుతున్నారు.