స్టార్ హోటల్లో శ్వేతను అదుపులోకి తీసుకోవటం.. ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించటం.. తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. అనంతరం ఆమె తన ఊరికి వెళ్లిపోయారు. అయితే ‘కొత్త బంగారు లోకం’ చిత్రం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఇటీవల వ్యభిచారం చేస్తూ రెడ్ హాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో ఆమెను టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
తాజాగా శ్వేతా బసు వ్యభిచారం కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అవకాశాలు తగ్గిపోయిన ఆమె ఈ చీకటి వ్యాపారంలోకి దిగిందని, జల్సా జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం ఈ పని చేస్తుందని అంటున్నారు. శ్వేతా బసు చాలా కాలంగా ఈ వృత్తిలో కొనసాగుతోంది. గతంలో ఓ టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లోనూ ఆమె దొరికి పోయింది. అప్పుడు పోలీసులు ఆమెను పిలిచి వార్నింగ్ ఇచ్చి వదిలేసారు. అయితే విలాసాలకు అలవాటు పడిన శ్వేతా బసు మళ్లీ అదే బాట పట్టింది. శ్వేతాబసు వ్యవహారంలో ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
ఒక మొబైల్స్ కంపెనీ ప్రతినిధి చేతుల్లో ఆమె కీలు బొమ్మగా మారిందని కథనాలు వినపిస్తున్నాయి. అయితే ఈ వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేసి…అవకాశాల తగ్గిన కొందరు వ్యభిచార వైపు మళ్లుతున్నారని, ఈ ప్రస్తుతం పరిశ్రమలో జోరుగా సాగుతోందని టాక్. రెండు వర్గాల మధ్య విబేధాలు రావడంతో శ్వేతా బసును కావాలనే పట్టించారని అంటున్నారు. వాస్తవానికి శ్వేతా బసు వద్దకు విటులను పట్టుకొస్తున్న బ్రోకర్ బాలు టార్గెట్గా కథ నడిచిందని, ఈ క్రమంలో శ్వేతా బసు కూడా పోలీసులకు చిక్కిందని అంటున్నారు.