ప్రభుత్వం కీలక నిర్ణయం. మహిళలకు నెలకు రూ 1,000 ఆర్థిక సాయం.

ప్రభుత్వం నెలవారీ డబ్బును నేరుగా మహిళా కుటుంబ పెద్దల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. దశలవారీగా లబ్ధిదారులందరికీ ATM కార్డులు అందజేయనున్నారు. సెప్టెంబర్ 15న లబ్ధిదారులకు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా చేయడంలో ఇబ్బందులు ఎదురైతే తెలియజేయాలని ఎస్‌ఎంఎస్‌తో పాటు టోల్‌ఫ్రీ నంబర్‌ను జోడించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అయితే తమిళనాడులో మహిళలకు స్టాలిన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న స్కీమ్​లకు తోడుగా మహిళలకు ఊరటనిచ్చే మరో కీలక పథకాన్ని మొదలుపెట్టేందుకు డీఎంకే ప్రభుత్వం సిద్ధమైంది. అధికార పార్టీ సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేస్తూ ఇంటికి దీపమైన మహిళలకు కనీస ఆదాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త స్కీమ్​ను ప్రారంభించనుంది. డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి అయిన సెప్టెంబర్ 15న ఈ కొత్త పథకాన్ని స్టార్ట్ చేయనున్నారు. మహిళల ప్రాథమిక ఆదాయం పేరుతో ఈ స్కీమ్​ను మొదలుపెట్టనున్నారు.

మహిళల ప్రాథమిక ఆదాయం పథకంలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన 1.06 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1,000 లభించనున్నాయి. స్టైఫండ్ రూపంలో దీన్ని వాళ్లకు చెల్లించేందుకు స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పేదరిక నిర్మూలన, లింగ సమానత్వాన్ని పెంచడానికి ఈ స్కీమ్ ఓ సాధనంగా అవుతుందని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని ప్రారంభించిన తేదీ నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమవుతాయని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ అమౌంట్ విత్​డ్రా కోసం లబ్ధిదారులకు ఏటీఎం కార్డులు కూడా జారీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *