కిరణ్ కుమార్ నగల వ్యాపారి, లలితా జ్యువెలర్స్ అధినేత. లలితా జ్యువెలర్స్ వ్యాపార ప్రకటనల్లో కనిపిస్తూ పేరుపొందాడు. రజినీకాంత్ హీరోగా 2014లో వచ్చిన లింగ సినిమాలోనూ కిరణ్ కుమార్ నటించి ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల కాలంలో దేశ విదేశాల నుండి భక్తులు వస్తున్నారు. సెలబ్రిటీల తాకిడి కూడా ఎక్కువ అయ్యింది. అంబానీ కుటుంబ సభ్యులే కాకుండా తాజాగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా సందర్శించిన సంగతి విదితమే.
వెంకటేశ్వరునికి భక్తులు విరాళాల రూపంలో కానుకలు అందజేస్తారు. అత్యధిక సంపద కలిగిన దేవాలయాల్లో తిరుమల నిలుస్తూ ఉంటుంది. తమ కోర్కెలు తీర్చినందుకు భక్తులు ఆయనకు బంగారు, వెండి ఆభరణాలకు విరాళంగా సమర్పిస్తుంటారు. తాజాగా ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ అధినేత తిరుమలను సందర్శించి.. భారీ విరాళాన్ని అందించారు. ఆయన ఎవ్వరో కాదూ.. ’డబ్బులు ఊరికనే రావు‘అంటూ మనల్నో స్ఫూర్తినింపే లలితా జ్యువెల్లరీ ఎండి కిరణ్ కుమార్.
బుధవారం శ్రీవారిని సందర్శించుకున్న ఆయన .. అష్ట దళ పాద పద్మరాధన సేవకు ఉపయోగించే 108 బంగారు పుష్పాలను టీటీడీకి అందజేశారు. కోటి 50 లక్షల విలువ చేసే బంగారాన్ని విరాళంగా అందించారు. బంగారు పూలను ఆయన మీడియాకు చూపించారు. అనంతరం ఆయన్ను శ్రీవారిని దర్శించుకున్నారు. కిరణ్ కుమార్ ను వేద పండితులు ఆశీర్వదించారు.