గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటు ఇవాళ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగిరావడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మన దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. మంగళవారంతో పోల్చితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ. 150 తగ్గింది.
అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది. దీంతో బుధవారం ఉదయం నమోదైన ధరల వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 1000 తగ్గింది.
దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాల్లో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో కిలో వెండి రూ. 75,200 కాగా, చెన్నైలో 79,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 75,500 కాగా, ముంబయిలో రూ. 75,200 గా ఉంది. అయితే, ఇవి కేవలం బుధవారం ఉదయం నమోదైన ధరలు మాత్రమే. ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.