పాము కాటు వేసిన చోట నొప్పిగా ఉంటుంది. ఆ ప్రదేశంలో కొద్దిగా వాపు వస్తుంది. అలాగే… అది పాలిపోయినట్లుగా కలర్ లేకుండా తయారవుతుంది.అంతేకాదు ఊపిరి సరిగా ఆడదు. వికారంగా ఉంటుంది. హైబీపీ వస్తుంది. నరాల వీక్నెస్ ఉంటుంది. జ్వరంగా కూడా ఉంటుంది. అయితే పాము కాటుకు విరుగుడుగా ఉత్తరేణి ఆకు పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉత్తరేణి ఆకు మనకు విరివిరిగా లభిస్తూనే ఉంటుంది. దీనిని సర్వరోగ నివారిణి అంటారు. ఈ మొక్క ఆకు రసాన్ని పాము కాటుకు గురి అయిన వారి ముక్కులో వేయడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి వారు బయట పడతారు.
వెంటనే వారిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి తగిన చికిత్స చేయించాలి. అంతేకాకుండా పాము కాటుకు గురి అయినప్పుడు దంత వేర్ల చూర్ణాన్ని పీల్చడం వల్ల పాము విషం విరిగిపోతుంది. పాము విషాన్ని హరించే శక్తి ఆముదపు ఆకులకు కూడా ఉంటుంది. లేత ఆముదపు ఆకులు 10 గ్రాములు, 7 నల్ల మిరియాలను తీసుకుని మెత్తగా చేసి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని పాము కాటుకు గురి అయిన వారిచే తాగించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది సమయం తరువాత వాంతులు అవుతాయి. ఇలా వాంతులు అయిన తరువాత మరోసారి ఈ రసాన్ని తాగించాలి.
ఇలా చేయడం పావు విషం హరించుకుపోయి ఆరోగ్యవంతుడు అవుతాడు. నిమ్మగింజలను నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పాము కాటుకు బాధితుడికి తాగించడం వల్ల అన్ని రకాలైన పాము విషాలు హరిస్తాయి. మామిడి టెంకలో ఉండే జీడిని పావు తులం, మిరియాలను పావు తులం, మామిడి పువ్వును తీసుకుని మెత్తగా నూరి ఒకగ్లాస్ నీటిలో కలిపి తాగించాలి. ఈ మిశ్రమాన్ని మూడు గంటలకు ఒకసారి ఇస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాము విషం విరిగిపోతుంది. పాము కాటుకు గురి అయిన వారికి పావు కేజీ నెయ్యిని తాగించిన కూడా వాంతి అయ్యి విషం బయటకు వస్తుంది.