షర్మిల కూతురితో జగన్ ఏం మాట్లాడుతున్నారో తెలుసా..?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఐప్యాక్ టీమ్‌తో సమావేశమయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్ టీమ్.. రాజకీయ సలహాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై వైఎస్ జగన్.. ఐప్యాక్ టీమ్‌తో చర్చించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. మరోవైపు తెలంగాణలో సీరియస్ పాలిటిక్స్ చేస్తున్న షర్మిల… ఓ పార్టీని కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ లో కలుస్తారన్న చర్చ జోరుగా వినిపిస్తోంది.

ఇక ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు షర్మిల. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు మాత్రం హింట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా కేవీపీ కూడా షర్మిల చేరిక విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *