మలయాళంలో ‘చందనమాల’ ‘ఆత్మసఖి’ ‘దేవస్పర్శమ్’ ‘మైథిలి వీన్డుమ్ ఓరుమ్’ వంటి పాపులర్ ధారావాహికలతో పాటు ‘మేఘతీర్థం’ ‘ఆచయన్స్’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో అపర్ణా పి నాయర్ నటించారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని సన్నిహితులు చెబుతున్నారు. అపర్ణా పి నాయర్కు ఇద్దరు పిల్లలున్నారు. అయితే మలయాళ నటి అపర్ణా నాయర్ తన ఇంట్లో శవమై కనిపించింది. 31 ఏళ్ల అపర్ణ హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆమె మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్లో తన చివరి పోస్ట్ను పంచుకుంది. అందులో ఆమె తన కుమార్తెపై ప్రేమను కురిపించింది. ప్రస్తుతం అపర్ణ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అపర్ణ మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు అందరూ షాక్కు గురయ్యారు. గురువారం సాయంత్రం తిరువనంతపురంలోని తన ఇంట్లో అపర్ణ ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

ఆమె మరణానికి ముందు అపర్ణ నాయర్ తన చిన్న కుమార్తె అందమైన ఫోటో, వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ గా ఓ లాలిపాటను జోడించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు, ‘మేరి ఉన్ని, ఉల్లాసభరితమైన చిన్నది’ అని క్యాప్షన్లో రాశాడు. అపర్ణ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఆమె భర్త , ఇద్దరు కుమార్తెల సంతోషంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో నిండి ఉంది. తన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, అపర్ణ తన భర్త సంజీత్ను ‘నా బలం’ అని పేర్కొంది.