తాజాగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు చిత్రయూనిట్. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
అయితే విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఖుషి
సినిమాలోని పాటకి స్టెప్పులేశారు. అయితే అది మామూలు స్టెప్పులు కాదు, స్టేజ్పై వేల మంది అభిమానుల ముందు క్రేజీ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కలిసి ఖుషి
చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది
మరోవైపు సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. మిలియన్స్ వ్యూస్తో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖుషి
మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేసింది యూనిట్. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో భారీగా ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. నోవాటెల్లో ఈవెంట్ జరుగుతుంది. వేల మంది అభిమానులు ఈ ఈవెంట్లో పాల్గొనడం విశేషం. దీంతో హోరెత్తిపోయింది.